Uttar Pradesh: ఏనుగుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పేరు పెట్టిన నెటిజన్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అటవీ అధికారులు ఏనుగుకు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Published : 07 Feb 2022 01:38 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అటవీ అధికారులు ఏనుగుకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. లఖింపూర్ ఖేరీలోని దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఎలిఫెంట్ పార్టీని అటవీశాఖ అధికారులు ఘనంగా చేశారు. ఏడాది వయసు ఉన్న ఏనుగుకు "మష్కలీ"గా నామకరణం చేశారు. ఈ చిట్టి ఏనుగు దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఏడాది క్రితం జన్మించింది. ఆన్‌లైన్‌లో 200 మంది పంపిన పేర్ల జాబితా నుంచి 'మష్కలీ' పేరును ఎంపిక చేసి.. అటవీ అధికారులు బేబీ ఏనుగుకు పెట్టారు. ఈ పార్టీలో ఏనుగులు తినేందుకు భారీగా చెరకు, బెల్లం, అరటిపండ్లను అధికారులు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని