Madhya Pradesh: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌!

ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 13 Dec 2022 10:15 IST

భోపాల్‌: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని ఉద్దేశించి మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాజా పటేరియా(Raja Pateria) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. దామోహ్‌ జిల్లా హట్టాలోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్ర ఆదేశాల మేరకు ఇక్కడి పన్నా జిల్లాలోని పవయీ పోలీస్‌ స్టేషన్‌లో పటేరియాపై కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా..  ‘‘రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ సిద్ధం కావాలి. ‘చంపడం’ అంటే ఆయనను ఓడించడమని అర్థం’’ అని పటేరియా అన్నట్లు సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పవయీలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పటేరియా అన్నారు. మరోవైపు.. భాజపాతోపాటు కాంగ్రెస్‌ నాయకులూ ఆయన మాటలను ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని