Uttarakhand: కళ్ల ముందే బ్రిడ్జి కూలిపోయింది!
రాణి పోఖారి గ్రామం వద్ద డెహ్రడూన్-రిషికేష్ బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై ప్రయాణిస్తున్న ట్రక్ ఒకటి నీటిలో పడిపోయింది
డెహ్రడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోటెత్తిన వరదల కారణంగా రహదారులు కొట్టుకుపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రాణి పోఖారి గ్రామం వద్ద డెహ్రడూన్-రిషికేష్ బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై ప్రయాణిస్తున్న ట్రక్ ఒకటి నీటిలో పడిపోయింది. మరికొన్ని వాహనాలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రిషికేష్- దేవప్రయాగ, రిషికేష్-తెహ్రీ, డెహ్రడూన్-ముస్సోరీ రహదారులను మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చే వరకూ ఆ మార్గంలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. తపోవన్ నుంచి మలేత వెళ్లే జాతీయ రహదారి 58ను కూడా పూర్తిగా మూసివేశారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ సందర్భంగా హెచ్చరికలు సైతం జారీ చేసింది. నైనిటాల్, ఉద్ధమ్సింగ్ నగర్, బాగేశ్వర్, పితోరాఘర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్