Temples: అక్కడి ఆలయాల్లో భక్తులకు డ్రెస్కోడ్..! ఇప్పటికే 130 చోట్ల అమల్లోకి
రాష్ట్రంలో దైవదర్శన సమయంలో భక్తులకు సరైన వస్త్రధారణ నిబంధనలను అమలు చేసే దిశగా మహారాష్ట్రలోని ఆలయాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతోపాటు పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని ‘మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్’ డిమాండ్ చేస్తోంది.
ముంబయి: మహారాష్ట్ర (Mahrashtra)లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నారా..! అయితే, మీ వస్త్రధారణ (Dressing)పై దృష్టి సారించుకోవాల్సిందే. ఎందుకంటే.. దైవదర్శన సందర్భంగా భక్తులకు సరైన వస్త్రధారణ నిబంధనలు (Dress Code) అమలు చేసే దిశగా ఆలయాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడుకునేందుకుగానూ ‘మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ (Maharashtra Mandir Mahasangh)’ ఈ మేరకు విస్తృత ప్రచారం చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 130కిపైగా ఆలయాలు ఈ డ్రెస్కోడ్ను అమలు చేస్తున్నాయి. దీంతోపాటు పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని మహాసంఘ్ కోరుతోంది. ఈ సంఘంలో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు, కార్యకర్తలు ఉన్నారు.
‘ప్రజలను దేవుళ్లకు దూరం చేయడం మా ఉద్దేశం కాదు. అయితే.. కొంతమంది సోషల్ మీడియా పాపులారిటీ కోసం సరైన వస్త్రధారణ లేకుండా ఆలయాలకు వచ్చి వీడియోలు చేస్తున్నారు. ఏ ప్రార్థనా స్థలం అయినా పవిత్రతను కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలో ఆలయాల సందర్శన సమయంలో ఎటువంటి వస్త్రాలు ధరించకూడదనే దానిపై దృష్టిసారిస్తున్నాం. రివీలింగ్, షార్ట్ ఫిట్టింగ్ లేదా బిగుతుగా ఉండే వస్త్రాలు, చిరిగిపోయిన దుస్తులు వంటివి ఇందులో వస్తాయి. ప్యాంటు, చొక్కాల వంటివాటిపై ఎలాంటి అభ్యంతరం లేదు’ అని మహాసంఘ్ సమన్వయకర్త సునీల్ తెలిపారు. ఏడాది చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ ఆలయాలు దీన్ని అమలు చేస్తాయని చెప్పారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం జంతుబలులు మినహాయించి.. దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల వాణిజ్య అమ్మకాలను నిషేధించాలనీ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్..
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.