Amway India: ఆమ్‌వే ఇండియాకు ఈడీ షాక్‌.. రూ.757కోట్ల ఆస్తులు అటాచ్‌

మల్టీ లెవల్‌ మార్కెటింగ్ ప్రమోటింగ్‌ కంపెనీ ఆమ్‌వే ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. గొలుసుకట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వేపై మనీలాండరింగ్‌

Published : 19 Apr 2022 02:39 IST

దిల్లీ: మల్టీ లెవల్‌ మార్కెటింగ్ ప్రమోటింగ్‌ కంపెనీ ఆమ్‌వే ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. గొలుసుకట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వేపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. రూ.757కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసుకున్నారు.

ఆమ్‌మే నిబంధనలకు విరుద్ధంగా గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీ ఉత్పత్తుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించే ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. మొత్తం రూ.757.77కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసుకున్నట్లు తెలిపారు. 

తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో సంస్థకు చెందిన భూమి, ఫ్యాక్టరీ భవనంతో పాటు యంత్రాలు, మిషనరీలను అధికారులు సీజ్‌ చేశారు. రూ.411.38కోట్ల విలువైన స్థిర, చరాస్తులు.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.345.94 కోట్ల నగదును అటాచ్‌ చేసుకున్నట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని