పాపం పీవోకే..!

కరాచీ: చైనా మహమ్మారి కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలని ఓ వైపు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పీవోకేలోని పేదలకు పాక్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు వారికి అందడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Published : 04 Apr 2020 00:33 IST

కరాచీ: చైనా మహమ్మారి కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలని ఓ వైపు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పీవోకేలోని పేదలకు పాక్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు వారికి అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్కడి అధికారులు వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరకులను రిటైల్‌ దుకాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే దుకాణాలకే వెళ్లి కొనుగోలు చేయాలని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని