కరోనా ఎఫెక్ట్: పేదరికం కోరల్లోకి కోట్ల మంది..!
world bank, coronavirus, COVID-19, poverty, world econmy, ప్రపంచ బ్యాంకు, కరోనా వైరస్, కొవిడ్-19, పేదరికం, ప్రపంచ ఆర్థక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాయని మరక... ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కొవిడ్-19 ప్రభావం వల్ల పెట్టుబడులు, ఉపాధి కల్పన, సృజనాత్మకత, విద్యారంగం, వాణిజ్యం, సరఫరా, వినియోగం వంటి అంశాలు బలహీనమయ్యాయని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. ఆధునిక కాలంలో ఎన్నడూ లేని విధంగా కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ అన్నారు. 2020 సంవత్సరంలో ఆరు కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారని ఆయన తెలిపారు. కాగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ప్రభావంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని డేవిడ్ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తికి అవసరమయ్యే మౌలిక వనరుల నిర్మాణం, వనరులు సమకూర్చటం వంటివి కొవిడ్ అనంతరం ఎదురయ్యే సవాళ్లలో ముందుంటాయని తెలిపింది.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గత పదేళ్లలో అనేక సమస్యలతో సతమతమౌతున్నాయని ... ఆర్థికాభివృద్ధి క్రమంగా క్షీణిస్తున్న ఈ దేశాలను కరోనా దెబ్బ తీసిందని నిఫుణులు తెలిపారు. ఆరోగ్య రంగం బలహీనంగా ఉన్న దేశాల్లోనే కాకుండా... మనుగడ కోసం అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఎగుమతులపై ఆధారపడ్డ దేశాల్లో కూడా కరోనా ప్రభావం అధికమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఆ దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేపట్టే చర్యలకు విఘాతం కలుగుతోందని ప్రపంచ బ్యాంకు అంటోంది. ఆర్థిక సంక్షోభం, మందగమనం వల్ల ఐదు సంవత్సరాల్లో ఆయా దేశాల్లో ఉత్పత్తి 8 శాతం వరకు పడిపోతుందని తెలిపింది. ఇక చమురు ధరల పెరుగుదల, ఉత్తత్తిని 11 శాతం వరకు దెబ్బతీయగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్