సవాళ్ల ఛేదనకు సై
చంద్రయాన్-3 చాలా సంక్లిష్ట ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా మరే దేశమూ ఇప్పటిదాకా చేరుకోలేకపోయిన జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువవడాన్ని ఈ ప్రయోగంలో భారత్ తన లక్ష్యంగా విధించుకుంది.
చంద్రయాన్-3లోని కీలక సాధనాలివే..
చంద్రయాన్-3 చాలా సంక్లిష్ట ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా మరే దేశమూ ఇప్పటిదాకా చేరుకోలేకపోయిన జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువవడాన్ని ఈ ప్రయోగంలో భారత్ తన లక్ష్యంగా విధించుకుంది. మరి ఇంతకీ చంద్రయాన్-3లో ఏమేం భాగాలున్నాయి? కఠిన సవాళ్ల ఛేదనకు దానిలో వినియోగిస్తున్న అత్యాధునిక పరికరాలేంటి? జాబిల్లిపై పరిశోధనలకు అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి? ఆ వివరాలను పరిశీలిస్తే..
మూడింటి కలయిక.. చంద్రయాన్-3లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి..
1) ప్రొపల్షన్ మాడ్యూల్
2) ల్యాండర్
3) రోవర్
ఈ మూడూ సమన్వయంతో పనిచేస్తేనే ఇస్రో కంటున్న జాబిల్లి దక్షిణ ధ్రువం కలలు సాకారమవుతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను మోహరించారు.
ప్రొపల్షన్ మాడ్యూల్
ఇది పెట్టె ఆకృతిలో ఉంటుంది. దీనికి ఒకవైపున భారీ సౌరఫలకాన్ని ఏర్పాటుచేశారు. పైభాగంలో సిలిండర్ ఆకృతిలో ఇంటర్మాడ్యూల్ అడాప్టర్ కోన్ ఉంటుంది. ఈ భాగానికే ల్యాండర్ను అమరుస్తారు. దీనికింద ప్రొపల్షన్ వ్యవస్థ, ప్రధాన థ్రస్టర్ నాజిల్ ఉంటాయి.
- ప్రొపల్షన్ మాడ్యూల్లో ‘స్పెక్ట్రోపొలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్’ (షేప్) అనే పేలోడ్ ఉంటుంది. అది చంద్రుడి కక్ష్యలో ఉంటూ.. భూమి నుంచి పరావర్తనం చెందిన కాంతిని విశ్లేషిస్తుంది. స్పెక్ట్రల్, పొలారిమెట్రిక్ కొలతలు సేకరిస్తుంది. ఈ డేటాను.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)పై పరిశోధనకు ఉపయోగిస్తారు. అక్కడ భూమి తరహాలో నివాసయోగ్య పరిస్థితులు ఉన్నాయా.. ఇప్పటికే అక్కడ జీవం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఉపయోగించనున్నారు.
- ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోనే ఉంటూ ల్యాండర్కు భూ కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్ ప్రసార ఉపగ్రహంలా పనిచేస్తుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్.. దీనికి బ్యాకప్గా వ్యవహరిస్తుంది.
ల్యాండర్
ఈ సాధనానికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్లు (రాకెట్లు) ఏర్పాటుచేశారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడానికి అవసరమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. అవి ప్రమాదకరమైన అవరోధాలను తప్పించుకోవడానికి, ల్యాండర్కు తాను ఎక్కడ ఉన్నానన్న విషయం తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ కోసం ఎక్స్ బ్యాండ్ యాంటెన్నా ఉంటుంది. ల్యాండర్లో 800 న్యూటన్ల సామర్థ్యం కలిగిన నాలుగు థ్రాటల్బుల్ ఇంజిన్లు, 58 న్యూటన్ల సామర్థ్యం కలిగిన 8 థ్రాటల్బుల్ ఇంజిన్లు ఉన్నాయి.
ల్యాండర్లో మొత్తం ఐదు పరికరాలు ఉన్నాయి. అవి..
1. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (చేస్ట్): చంద్రుడి కండక్టివిటీ, ఉష్ణోగ్రతలను కొలుస్తుంది.
2. ఇన్స్ట్రూమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ): ల్యాండింగ్ ప్రదేశంలో చంద్రుడి ప్రకంపనలను కొలవడానికి ఉపయోగపడుతుంది. చందమామ క్రస్టు, మ్యాంటిల్ పొరల తీరుతెన్నులను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
3. లాంగ్ముయిర్ ప్రోబ్: ప్లాస్మా సాంద్రత, దాని వైరుధ్యాలను లెక్కిస్తుంది.
4. ప్యాసివ్ లేజర్ రెట్రోరిఫ్లక్టర్ అరే (ఎల్ఆర్ఏ): దీన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అందించింది. ఇది చంద్రుడికి సంబంధించిన రేంజింగ్ అధ్యయనాల కోసం ఉపయోగపడుతుంది.
5. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్ (రంభా): చంద్రుడిపైన ఉండే గ్యాస్, ప్లాస్మా వాతావరణం గురించి శోధిస్తుంది.
రోవర్
ఇది దీర్ఘచతురస్రాకార ఆకృతిలో.. ల్యాండర్లోని ఒక ఛాంబర్లో ఉంటుంది. ర్యాంప్ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడం కోసం దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్ కెమెరాను అమర్చారు. సైన్స్ పరిశోధనల కోసం ఇందులో ఆల్ఫా పార్టికిల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కొపీ అనే పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ల్యాండింగ్ ప్రాంతంలో మూలకాల గురించి శోధిస్తాయి. ఆర్ఎక్స్/టీఎక్స్ యాంటెన్నాల ద్వారా నేరుగా ల్యాండర్తో రోవర్ కమ్యూనికేషన్ సాగించగలదు.
ఎంతకాలం పనిచేస్తాయి?
జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా దిగాక ల్యాండర్, రోవర్లు.. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎంతకాలం పనిచేస్తాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే! జాబిల్లిపై ఒక రోజు నిడివి భూమిమీద సుమారు 28 రోజులు. అందులో పగటి సమయం 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి సమయం మొదలవుతుంది. అది చాలా శీతలంగా, ప్రతికూలంగా ఉంటుంది. సౌరశక్తి లభించదు. ఆ వాతావరణాన్ని చంద్రయాన్-3 పరికరాలు తట్టుకొని నిలబడటం అనుమానమే! అందువల్ల 14 రోజులు మాత్రమే పనిచేసేలా ల్యాండర్, రోవర్లను రూపొందించారు. అయితే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ సూర్యోదయమయ్యాక అవి ‘నిద్రాణం’ నుంచి మేల్కొని, తిరిగి పనిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
- 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజులపాటు పనిచేసింది. చంద్రుడి ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొని, భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
- 2013లో అంగారకుడి వద్దకు ప్రయోగించిన మంగళయాన్ వ్యోమనౌక 2014 సెప్టెంబరు 24న అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలలు మాత్రమే అది పనిచేస్తుందని భావించినప్పటికీ ఏకంగా 8 ఏళ్లపాటు సేవలు అందించింది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty)పై ఆన్లైన్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. -
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టే చర్యలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. -
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
ముంబయిలో ఇటీవల చోటుచేసుకున్న హోర్డింగ్ దుర్ఘటనను ఎనిమిదేళ్ల క్రితమే ఓ రచయిత తన పుస్తకంలో ప్రస్తావించారు. -
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
సీఏఏ అమల్లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరుచేసింది. -
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
ముంబయిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న హోర్డింగ్ను అక్రమంగా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. -
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
గాజాలో పని చేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతిపై ఐక్యరాజ్యసమితి సంతాపం తెలియజేసింది. -
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
మరోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపడితే.. పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు