బిహార్లో రైలుకు నిప్పంటించిన అభ్యర్థులు
రైల్వే నియామకాల కోసం రెండు అంచెల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించడాన్ని తప్పుపడుతూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విధానం వల్ల ఎక్కువ విద్యార్హతలున్నవారు లబ్ధి పొందుతారని వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. బిహార్లోని గయలో నిరసనలకు దిగిన కొందరు ఉద్యోగార్థులు అక్కడి యార్డులో ఉన్న భభువా-పట్నా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు నిప్పంటించారు. రైలులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. సీతామడీ రైల్వేస్టేషన్
ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్ష రద్దు
రెండంచెల విధానంపై నిరసన గళం
అభ్యంతరాల పరిశీలనకు కమిటీ
దిల్లీ, పట్నా: రైల్వే నియామకాల కోసం రెండు అంచెల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించడాన్ని తప్పుపడుతూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విధానం వల్ల ఎక్కువ విద్యార్హతలున్నవారు లబ్ధి పొందుతారని వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. బిహార్లోని గయలో నిరసనలకు దిగిన కొందరు ఉద్యోగార్థులు అక్కడి యార్డులో ఉన్న భభువా-పట్నా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు నిప్పంటించారు. రైలులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. సీతామడీ రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆందోళనల నేపథ్యంలో ‘నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ)’ (సాంకేతికేతర ప్రాచుర్య విభాగాల) మొదటి స్థాయి (లెవెల్-1) పరీక్షలను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. అభ్యంతరాలను, సందేహాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. అభ్యర్థులు rrbcommittee@railnet.gov.in ఈ మెయిల్ ద్వారా తమ ఫిర్యాదులను, సూచనలను ఫిబ్రవరి 16 వరకు పంపించవచ్చు. కమిటీ తమ సిఫార్సులను మార్చి 4లోగా అందిస్తుంది.
ఇతర పరీక్షలు వాయిదా
కమిటీ నియామకం దృష్ట్యా ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన సీబీటీ రెండో దశ పరీక్షలు, అదే నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన (సీఈఎన్ ఆర్ఆర్సీ 01/2019) తొలిదశ పరీక్షలు వాయిదా పడినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఎన్టీపీసీ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తే తొలిదశ పరీక్షను రాసి అర్హత సాధించిన వారిని మోసం చేసినట్లే అవుతుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు 35,000 పోస్టుల కోసం 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎక్కువ విద్యార్హతలున్నవారిని పరీక్ష రాయకుండా చట్టబద్ధంగా నిలువరించలేమని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రయాగ్రాజ్లో అల్లర్లకు సంబంధించి దాదాపు వెయ్యిమంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.
స్పందించిన రాహుల్, ప్రియాంక
భాజపా సర్కారు విధానాలపై పోరులో విద్యార్థులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. ఉద్యోగార్థుల అభ్యంతరాలను చర్చల ద్వారా పరిష్కరించాలని, వారి గొంతునొక్కే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM