ప్రముఖులకు కెంపేగౌడ పురస్కారాలు
కర్ణాటకలో పేరొందిన కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాలను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్లకు ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరు నగర
బెంగళూరు, న్యూస్టుడే: కర్ణాటకలో పేరొందిన కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాలను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్లకు ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరు నగర నిర్మాత నాడప్రభు కెంపేగౌడ 513వ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం బసవరాజ బొమ్మై వీరికి పురస్కారాలను ప్రదానం చేస్తారు. స్మార్టప్ విజన్ గ్రూపునకు చెందిన ప్రకాశ్ నేతృత్వంలో విద్యావేత్త మోహన్దాస్ పాయ్, వివేకానంద యూత్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బాలసుబ్రహ్మణ్యం, విశ్రాంత ఐఏఎస్ అధికారి శంకరలింగేగౌడ సభ్యులుగా ఉన్న సమితి వీరిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పురస్కారంలో భాగంగా స్మరణిక, రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు