200 అడుగుల లోయలో పడిన బస్సు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. కులు నుంచి షైన్షేర్‌ వెళుతున్న బస్సు ఉదయం 8

Published : 05 Jul 2022 03:49 IST

13 మంది మృతి.. ఇద్దరికి గాయాలు
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘరో రోడ్డు ప్రమాదం

శిమ్లా/మనాలి: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. కులు నుంచి షైన్షేర్‌ వెళుతున్న బస్సు ఉదయం 8 గంటల సమయంలో జాంగ్లా గ్రామం దగ్గర ఘాట్‌ రోడ్డులో మలుపు తిరుగుతూ అదుపుతప్పి 200 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ విషాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని