విషమంగానే లాలూ ఆరోగ్యం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం పట్నాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

Published : 07 Jul 2022 03:59 IST

పట్నా, దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం పట్నాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లాలూ కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం.. పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపై నుంచి పడిపోగా కుడి భుజం ఎముక విరిగింది. పట్నా ఆస్పత్రిలో బుధవారం లాలూను బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని