మథురలో మత వివాదం
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీద్ ఈద్గా వద్ద హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్తున్న ‘అఖిల భారత హిందూ మహాసభ’ నాయకుడు సౌరభ్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు.
హిందూ మహాసభ నేత అరెస్టు
మథుర: ఉత్తర్ప్రదేశ్లోని మథురలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీద్ ఈద్గా వద్ద హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్తున్న ‘అఖిల భారత హిందూ మహాసభ’ నాయకుడు సౌరభ్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు 40 మంది హిందుత్వ కార్యకర్తలను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎనిమిది మంది నేతల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. బాబ్రీ మసీదు కూల్చివేసి 30 ఏళ్లైన సందర్భంగా ఈ మసీదులో హనుమాన్ చాలీసా పఠించేందుకు రావాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఏ ఒక్కరూ ఈద్గా వద్దకు చేరుకోలేకపోయారనీ, అరెస్టయిన వారిని వ్యక్తిగత బాండుపై విడుదల చేశామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434