chandrayaan 3: చంద్రయాన్‌ సక్సెస్‌.. #రాకేశ్‌రోషన్‌ పేరిట నెట్టింట మీమ్స్‌

చంద్రయాన్‌ సక్సెస్‌ అనంతరం సోషల్‌మీడియాలో మీమ్స్‌ హోరెత్తుతున్నాయి. విజయాన్ని భారతీయులు ఆనందిస్తున్న క్షణాలతో పాటు రాకేశ్‌ రోషన్‌ పేరిటా కొన్ని మీమ్స్‌ సందడి చేస్తున్నాయి.

Updated : 24 Aug 2023 15:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 (chandrayaan 3) ప్రయోగం విజయవంతం అయ్యింది. విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా వాలడంతో.. ప్రగ్యాన్‌ రోవర్‌ తన పనిని ప్రారంభించింది. ప్రయోగం సక్సెస్‌ అవ్వడంతో భారత పౌరులు సంబరాలు చేసుకున్నారు. ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ప్రయోగం అనంతరం భారత పౌరుల రియాక్షన్‌ ఇదీ అంటూ మరికొందరు మీమ్స్‌తో ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌, నిర్మాత, హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీనే అందుకు కారణం. చంద్రుడిపై కాలుమోపిన రాకేశ్‌ శర్మ అనడానికి బదులు ఆమె పొరపాటున రాకేశ్‌ రోషన్‌ పేరును ప్రస్తావించారు. ‘‘రాకేశ్‌ రోషన్‌ చంద్రుడిపై కాలు మోపినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ ‘అక్కడి నుంచి చూడ్డానికి భూమి ఎలా ఉంది’ అని అడిగారు’’ అంటూ దీదీ మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇక అంతే ఒక్కసారిగా రాకేశ్‌ రోషన్‌ను మీమ్స్‌తో చంద్రుడిపైకి పంపించేశారు మీమర్స్‌. వాస్తవానికి రాకేశ్‌ శర్మ వెళ్లింది అంతరిక్షంలోకి.. చంద్రుడిపైకి కాదు.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని