Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్లలో సరికొత్త ఫీచర్లు
దేశవ్యాప్తంగా తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. వీటిలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains) సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ల సంఖ్య 34కి చేరింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో (కాసర్గోడ్-తిరువనంతపురం రూట్లో ఒకటి), మిగిలిన రైళ్లు నీలం రంగులో నడుపుతున్నారు. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ప్రారంభించిన 9 రైళ్లలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. మరి, అవేంటో చూద్దాం.
- కొత్తగా ప్రారంభించిన వందే భారత్ కోచ్లలో సీటు రిక్లైనింగ్ యాంగిల్ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు. దానివల్ల ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
- ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్ గట్టిగా ఉందనే విమర్శల నేపథ్యంలో కొత్త కోచ్లలో మెత్తటి కుషన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్రెస్ట్ను మరింత పొడిగించారు.
- కొత్తగా సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్ను ఏర్పాటు చేశారు. మొబైల్ ఛార్జింగ్ కోసం సీట్ల కింద ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లను సులువుగా యాక్సెస్ చేసేలా వాటిలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
- ఇవే కాకుండా టాయిలెట్లో మెరుగైన లైటింగ్ కోసం 1.5 వాట్ బల్బుల స్థానంలో 2.5 వాట్ బల్బులను అమర్చారు. వాష్ బేషిన్లో చేతుల కడిగే సమయంలో నీళ్లు బేసిన్ నుంచి బయటికి రాకుండా వాటి సైజ్ను పెంచారు. ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా వాటర్ ట్యాప్లు, టాయిలెట్ హ్యాండిల్స్ను కొత్తగా డిజైన్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
- దివ్యాంగుల వీల్ఛైర్లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ఎయిర్టైట్ ప్యానల్స్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
- దాంతోపాటు లగేజ్ ర్యాక్ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్ కంట్రోల్స్ను ఏర్పాటు చేశారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
Israel- Hamas Conflict: హమాస్ సంస్థ విషయంలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చినట్టుగా ఉన్న కాగితాలు వైరల్ కావడంపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. -
NIA: 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు
ఐసిస్ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. -
Kapil Sibal: అస్సాం అప్పుడు మయన్మార్లో భాగమే: కపిల్ సిబల్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత
Kapil Sibal: ‘అస్సాం (Assam)’పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ఖండించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ కపిల్ సిబల్ ఏమన్నారంటే..? -
Vegan Technology: ‘శాకాహార’ సంచులు, పాదరక్షలు!
తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్) అభివృద్ధి చేసింది. -
Supreme Court: జడ్జీలు తీర్పుల్లో ఉపదేశాలివ్వరాదు: సుప్రీం
తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం కానీ, ఉపదేశాలివ్వడం కానీ చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. -
ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందన
ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు. -
అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు
దేశంలోని బంధుప్రీతి, అవినీతి, కులతత్వం స్థానాలను గత పదేళ్లలో అభివృద్ధితో భర్తీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
తొలి బుల్లెట్రైలు స్టేషన్ అదరహో!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ‘ఎక్స్’ ద్వారా పంచుకొన్నారు. -
ష్.. పేరెంట్ - టీచర్ మాట్లాడుకొంటున్నారు!
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన పోస్టుల్లో చమత్కారం ఉంటుంది. తాజాగా స్మృతి నెట్టింట్లో చేసిన ఓ పోస్టు వైరల్గా మారింది. -
బెంగాల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 9 మంది నవజాత శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 9 మంది నవజాత శిశువులు మృతిచెందడం కలకలం రేపుతోంది. -
వెడ్ ఇన్ ఇండియా.. మీరే ప్రారంభించాలి
భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. -
మోదీకే అత్యధిక ప్రజామోదం
ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. -
వచ్చే ఏడాది మార్చి వరకు.. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి, తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. -
నెలసరి సెలవులపై ప్రతిపాదనలు పరిశీలనలో లేవు
నెలసరి సెలవును ప్రకటించే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని కేంద్రం స్పష్టం చేసింది. -
గుజరాత్లో ఏడాదిన్నరగా నకిలీ టోల్ప్లాజా
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఘరానామోసం ఆలస్యంగా బయటపడింది. మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్ప్లాజా ఉంది. -
గంటల వ్యవధిలో 4 రాష్ట్రాల్లో భూప్రకంపనలు
నాలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలోనే భూప్రకంపనలు సంభవించడం కలకలం రేపింది. -
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
ఊయలలో పడుకోబెట్టిన ఆరు నెలల చిన్నారి ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో ఊపిరాడక ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి పరిమితి విధించాలన్న పిటిషన్ తిరస్కరణ
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
హరియాణా ఎమ్మెల్యే - ఐఏఎస్ల పెళ్లికి 3 లక్షల మందికి ఆహ్వానాలు
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిని మనువాడనున్నారు. -
ఎగుమతి పరపతిపై జూన్ దాకా రాయితీ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ భారతీయ ఎగుమతిదారులకు తోడ్పాటు కొనసాగించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
-
Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?