Poonch attack: పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
ఇంటర్నెట్డెస్క్: జమ్మూ-కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో వాయుసేనకు చెందిన వాహనశ్రేణిపై దాడి కేసు దర్యాప్తులో ఏజెన్సీలు కీలక ముందడుగు వేశాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం గమనార్హం. వీరిని ఇల్లియాస్ (పాక్ మాజీ కమాండో), అబూ హమ్జా (లష్కరే కమాండో), హడూన్గా గుర్తించారు. ఇల్లియాస్ను ఫౌజీ అనే పేరుతోను పిలుస్తారు.
కొత్తగా ఏర్పాటుచేసిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలకు తెరతీశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో షహసితార్, గురుసాయ్, సనాయ్, షీన్దార్ టాప్ ప్రాంతాలను సైన్యం, పోలీసులు జల్లెడ పడుతున్నారు. దాడిలో ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్ను, స్టీల్ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో కూడా సైనిక వాహనంపై పీఏఎఫ్ఎఫ్ సంస్థ ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేశారు. నాటి ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. అప్పుడు కూడా స్టీల్ తూటాలు వాడినట్లు గుర్తించారు.
పీర్పంజాల్లో ఏం జరుగుతోంది..?
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం కొత్త ముసుగు తొడిగింది. పీర్పంజాల్ పర్వతాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మార్చేందుకు పాక్ యత్నిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత జమ్మూలో రాజౌరీ, పూంఛ్ జిల్లాలు గతేడాది నుంచి హింసతో దద్దరిల్లుతున్నాయి. 2021 నుంచి ఇక్కడ జరిగిన ఉగ్ర దాడుల్లో సుమారు 36 మంది సైనికులు, ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో సగానికి పైగా 2023లోనే చోటుచేసుకొన్నాయి.
ఆర్థిక కార్యదళం ఒత్తిడి నుంచి బయటపడేలా పాకిస్థాన్ వ్యూహం మార్చింది. లష్కరే తోయిబా ముసుగు సంస్థగా టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫోర్స్), జైషే మొహమ్మద్కు చెందిన పీఏఏఎఫ్ (పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్), హిజ్బుల్ సహా మిగిలిన సంస్థల ఉగ్రవాదులను పోగేసి జమ్మూకశ్మీర్ ఘజ్నవీ ఫోర్స్ సంస్థలను ఏర్పాటుచేశాయి. వీటిల్లో స్థానికులను నియమిస్తున్నాయి.
2022లో జమ్మూకశ్మీర్లో 187 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. వారిలో స్థానికుల సంఖ్య 130. ఇక 2023లో సెప్టెంబరు నాటికి 53 మందిని ఎన్కౌంటర్ చేయగా.. ఇందులో స్థానికుల సంఖ్య 11 మాత్రమే. ఇటీవల విదేశీ ఉగ్రవాదుల రాక పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా దాడిలో విదేశీ ఉగ్రవాది ఉండటం గమనార్హం. ఉగ్ర చొరబాట్లకు జమ్మూలోని రాజౌరీ-పూంఛ్ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గతేడాది జరిగిన తొమ్మిది ఎన్కౌంటర్లలో ఆరు ఈ రెండు జిల్లాలోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
కశ్మీర్ లోయలోని మైదాన ప్రాంతాలతో పోలిస్తే గుహలతో నిండిన ఈ పర్వతాలు ఉగ్రవాదులు నక్కి ఉండటానికి అనుకూలం. ఇక్కడి పీర్ పంజాల్ పాస్ కశ్మీర్ను రాజౌరీ-పూంఛ్తో కలుపుతుంది. ఈ జిల్లాలకు 225 కి.మీ. మేరకు పాక్తో సరిహద్దు (ఎల్వోసీ) ఉంది. ఉగ్రమూక పూంఛ్లో ఎల్వోసీ దాటితే షోపియాన్, పుల్వామా, బుద్గామ్, బారాముల్లా, ఉరి ప్రాంతాలకు చేరుకోవచ్చు. అదే రౌజౌరీలో దాటితే రెయసీ(reasi), కుల్గామ్, కోకెర్నాగ్కు వెళ్లొచ్చు. భద్రతా దళాలు కశ్మీర్లోని అనంత్నాగ్, శ్రీనగర్, షోపియాన్, బారాముల్లా వంటి ప్రాంతాలపై పట్టు బిగించడంతో ముష్కరులు పీర్పంజాల్లోకి మకాం మార్చారు. ఈ ప్రాంతంలోని భింబర్ గలి, డేరాకీ గలి, మెందహార్, సురాన్ కోట్ అడవులు ఉగ్ర పుట్టలుగా మారాయి.
పాక్ నుంచి డ్రోన్లతో సాయం..
సరిహద్దుల సమీపంలో ఉండటంతో ఎన్కౌంటర్ల వేళ పాక్ నుంచి డ్రోన్లు ఇక్కడికి ఆయుధాలు చేరవేస్తున్నాయి. 2021 అక్టోబర్లో 17 రోజుల పాటు పూంఛ్ జిల్లాలో సుదీర్ఘ ఎన్కౌంటర్ జరగడమే దీనికి నిదర్శనం. గతేడాది జరిగిన ఓ ఎన్కౌంటర్లో కూడా డ్రోన్ల కదలికలను దళాలు గుర్తించాయి. ఇక్కడ మన దళాలపై దాడుల్లో పాక్ సైనికులు, బోర్డర్ యాక్షన్ బృందాలు, మాజీ సైనికులు కూడా పాల్గొనే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది. ముష్కరులు అమెరికా, చైనా తయారీ ఆయుధాలను వాడుతున్నారు. తాజాగా వాయుసేన కాన్వాయ్పై దాడిలో కూడా ఇలాంటివి వాడారు. స్నైపర్లు కూడా వీరిలో ఉండటం పాక్ సైన్యం పాత్రను బలపరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
తన భార్య మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ వాపోయారు. -
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గేను ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ తాజాగా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సీఐఎస్ఎఫ్’ నిర్వహించనుంది. 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. -
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..