CM Jagan: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్‌

విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌ సీబీఐ కోర్టు అనుమతి కోరారు.

Updated : 08 May 2024 22:32 IST

హైదరాబాద్‌: పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈనెల 13న పోలింగ్‌.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఈనెల 17 నుంచి జూన్‌ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. జగన్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని