Brian Lara: నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ విండీస్కు చెందిన బ్రియాన్ లారా (Brian Lara). ఇంగ్లాండ్పై 2004లో ఏకంగా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ రికార్డును అధిగిమించే క్రికెటర్ ఇప్పటివరకు కనిపించలేదు. ఈక్రమంలో తన వ్యక్తిగత ఘనతను మరిపించే ప్రదర్శన చేయగల సత్తా భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్కు (Yashavi Jaiswal) ఉందని బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. కేవలం టెస్టు రికార్డు మాత్రమే కాకుండా చాలావాటిని కొట్టగల సామర్థ్యం అతడికి ఉందని పేర్కొన్నాడు. గతేడాది లారా హైదరాబాద్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. పోయిన సంవత్సరం నుంచి యశస్వి ఆటను గమనిస్తే చాలా మార్పులు వచ్చాయని మెరుగ్గా ఆడుతున్నాడని అభినందించాడు.
‘‘నా రికార్డులకు ముప్పు ఉందని భావిస్తున్నా. యశస్వి జైస్వాల్కు మంచి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు డబుల్ సెంచరీలు బాదాడు. గతేడాది ఓ మ్యాచ్ సందర్భంగా నాతో యశస్వి మాట్లాడాడు. మా మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అదే తొలిసారి సంభాషణ. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. నేను చాలా త్వరగా అతడితో కలిసిపోయా. హైదరాబాద్ - రాజస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత నా స్నేహితుడితో కలిసి హోటల్ రూమ్కు వెళ్లా. అప్పటికే అర్ధరాత్రి అయింది. జైస్వాల్ నా దగ్గరకు వచ్చాడు. వేకువజామున 4 గంటల వరకు మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం చెప్పినా వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
యశస్విలో నేర్చుకోవాలనే ఆత్రుత ఎక్కువ. మా సంభాషణ తర్వాత అతడు కొద్దిగా మెరుగవుతాడని అనుకున్నాం. కానీ, అతడి ఆటతీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతస్థాయికి ఎదిగాడు. నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడం అభినందనీయం. క్రికెట్కు సంబంధించిన ఏ అవసరం ఉన్నా కాంటాక్ట్ కావాలని నా నంబర్ ఇచ్చా. ఎడమ చేతివాటం బ్యాటర్లను చూడగానే కాస్త పక్షపాతం చూపిస్తా. అభిషేక్ శర్మను చూసినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కుర్రాళ్లు ఎంతో గౌరవంగా ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరతారు. టెస్టుల్లో 400 మైలురాయిని అందుకొనే ఆటగాళ్లు ఉన్నారని అనుకుంటున్నా. అందులో యశస్వికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి 300+ మార్క్ను తాకి సవాల్ విసిరారు. గతంలో సనత్ జయసూర్య, ఇంజిమామ్ ఉల్ హక్, మ్యాథ్యూ హేడెన్ తదితరులు బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. రికార్డులు అనేవి ఎప్పటికైనా బద్దలు కొట్టడం సహజమే’’ అని లారా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్