Har Ghar Tiranga: సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (Pm Narendra Modi) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ సోషల్‌ మీడియా ఖాతాల డీపీల్లో జాతీయ జెండాను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated : 13 Aug 2023 11:53 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు కేంద్రం హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (Pm Narendra Modi) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల (Social Media) డీపీగా (Display Photo) జాతీయ జెండా ( National Flag)ను పెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తన ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఖాతాలో ట్వీట్ చేశారు. దేశం, మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు. 

సామాజిక మాధ్యమాల్లో అగ్రపథాన మోదీ

‘‘ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మనమంతా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియా ఖాతాల డీపీలో జాతీయ జెండాను ఉంచుదాం. దేశానికి, మనకు మధ్య బంధాన్ని పెంపొందించే ఈ కార్యక్రమానికి మన వంతు మద్దతునిద్దాం’’అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పౌరుల్లో దేశ భక్తిని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండా పట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శుక్రవారం మోదీ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని