Joshimath: జోషీమఠ్ కుంగుబాటు: ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడిన ప్రధాని
జోషీమఠ్ (Joshimath)లోని పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అడిగి తెలుసుకొన్నారు. ఆ ప్రాంతాన్ని కాపాడటానికి వీలైనంత సాయం చేస్తామన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఉత్తరాఖండ్లోని జోషీమఠ్(Joshimath)లో వందల సంఖ్యలో ఇళ్లు కుంగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)స్పందించారు. నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామితో ఆయన మాట్లాడారు. ఆ రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం చేస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. దీనిపై ధామి మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. జోషీమఠ్(Joshimath)లో పరిస్థితిని.. పునరావాసం, రక్షణ చర్యలను చర్యలను అడిగి తీసుకొన్నారు. జోషీమఠ్(Joshimath)లో విశ్లేషిస్తున్నారు. పర్వతాలపై ఉండి ప్రమాదకర పరిస్థితికి చేరుకొన్నా నగరాల గురించి చర్చించుకొన్నాం. జోషీమఠ్ (Joshimath)ను కాపాడేందుకు వీలైనంత సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.
మరోవైపు జోషీమఠ్ (Joshimath)పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించేందుకు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో క్యాబినెట్ సెక్రెటరీ, ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సభ్యలు పాల్గొననున్నారు. జోషీమఠ్ (Joshimath)జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర సీనియర్ అధికారులు కూడా వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.
జోషీమఠ్(Joshimath) హిమాలయా సానువుల్లో ఓ చిన్న పట్టణం. బద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడి విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సైనికులకు, హిమాలయ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఇదే బేస్ క్యాంప్. బద్రీనాథ్ సందర్శనకు వెళ్లే భక్తుల్లో చాలామంది రాత్రి ఇక్కడే బస చేస్తారు. భారత సైనిక దళాలకు ఇదో వ్యూహాత్మక పట్టణం. ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థానమైన విష్ణుప్రయాగకు చేరువలో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్