సైనికుల కోసం సోలార్ టెంట్.. ఎలా పనిచేస్తుంది?
సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే చల్లని వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ సోలార్ టెంట్లను తయారుచేశారు....
రూపొందించిన శాస్త్రవేత్త సోనమ్ వాంగ్చుక్
ఇంటర్నెట్ డెస్క్: సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ సహా అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోతాయి. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ సోలార్ టెంట్లను తయారుచేశారు. ఆయన గతంలో విభిన్నమైన ఆవిష్కరణలు చేసి పేటెంట్లను కూడా పొందారు. గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం తాజాగా ఈ గుడారాలను రూపొందించారు.
ఈ సోలార్ టెంట్ పగటి వేళల్లో సౌర శక్తిని గ్రహించి రాత్రి వేళల్లో ఆ చోటును వెచ్చగా ఉంచుతుంది. హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివిస్ట్ లద్దాఖ్కు చెందిన బృందంతో కలిసి ఈ సోలార్ టెంట్ను తయారుచేసినట్లు సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. బయట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక్కో టెంట్లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఆ టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉండటంతో దాన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సియాచిన్, బ్లాక్టాప్ హిల్ వంటి చల్లని ప్రదేశాల్లోని సైనికులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. సూపర్ లైట్ ఆల్యూమినియమ్ మెటీరియల్ను ఉపయోగిస్తే టెంట్ బరువును మరో 10 కేజీలు తగ్గించవచ్చని వాంగ్చుక్ పేర్కొన్నారు. ఈ శీతాకాలంలో ఎత్తయిన, చల్లని ప్రాంతంలో ఈ టెంటును పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్