Anand Mahindra: ఇంత వరకు తెలియదు..ఆ కోట ఎక్కాలని ఉంది: ఆనంద్ మహీంద్రా
మహారాష్ట్రలోని కలావంతి కోట ఎక్కాలని ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వ్యాపార లావాదేవీలతో ఎంతో బిజీబిజీగా ఉన్నప్పటికీ.. తరచూ సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన ప్రతిపోస్టు ఆసక్తికరంగానో, స్ఫూర్తిదాయకంగానో, గుండెల్ని పిండేసే విధంగానో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా, ఆయన మహారాష్ట్రలోని కలావంతీ కోట గురించి ట్విటర్లో రాసుకొచ్చారు. ఆ కోట ఎక్కాలని ఉందంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.
మన దేశంలోనే ఉన్నా ఈ ప్రాంతం గురించి ఇప్పటి వరకు తనకు తెలియదని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఈ ట్రెక్కింగ్ పశ్చిమకనుమల్లోనే అత్యంత భయంకరమైనదని, దాదాపు 60 డిగ్రీ ఏటవాలులో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఈ సవాల్కు తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాలన్నారు. ఎవరో వ్యక్తి ఆ కోట నుంచి కిందికి దిగుతుండగా తీసిన వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్టు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. ‘మార్గం నిటారుగా కనిపిస్తోంది. బహుశా అది కెమెరా వల్ల కూడా కావొచ్చు. ఎవరైనా వెళ్లాలనుకుంటే కచ్చితంగా మంచి షూ ధరించి వెళ్లండి’ అని సలహా ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీలైతే మీరు కూడా వెళ్లండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.