బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్‌!

అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇందులో బన్నీ చెల్లెలుగా నటి ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి.

Published : 26 Apr 2021 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ఇందులో బన్ని సోదరిగా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి. ఓ ఫారెస్ట్ అధికారి కారణంగా తన చెల్లెలు చనిపోవడంతో అతనిపై పగ తీర్చుకోవడం కోసం పుష్పరాజ్‌ ఎర్రచందనం దొంగగా మారతాడట.

ఇటీవల చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇందులో మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మైత్రిమూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, అనసూయ తదితరులు నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 13న సినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని