Bollywood: వేసవిలో ‘జయేష్భాయ్’... నూతన ఏడాదికి ‘ఈద్ దీవాళి’
బాలీవుడ్లో ఒకేరోజు ఇద్దరు ప్రముఖ కథానాయకుల చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. ఈ ఏడాది వేసవికి ‘జయేష్భాయ్ జోర్దార్’గా రణ్వీర్ సింగ్ వినోదాలు పంచనున్నారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో హాస్య ప్రధానంగా
బాలీవుడ్లో ఒకేరోజు ఇద్దరు ప్రముఖ కథానాయకుల చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. ఈ ఏడాది వేసవికి ‘జయేష్భాయ్ జోర్దార్’గా రణ్వీర్ సింగ్ వినోదాలు పంచనున్నారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో హాస్య ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాలినీ పాండే నాయిక. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ త్వరలో ‘కభీ ఈద్ కభీ దీవాళి’ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. సల్మాన్కు జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించనున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమా సెట్స్పైకి వెళ్లకముందే విడుదల తేదీని ఖరారు చేశారు. వచ్చే ఏడాదికి నూతన సంవత్సర కానుకగా ఈ ఏడాది డిసెంబరు 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం తాజాగా నిర్ణయించింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వీరం’ చిత్రానికి రీమేక్గా ఇది రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!