15ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జోడీగా ఆ భామ?

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించి..

Published : 23 Feb 2021 15:36 IST

ఈసారైనా సవ్యంగా సాగేనా?

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్‌ హీరోయిన్‌ మెగాస్టార్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు  తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌?

చిరంజీవి నటించిన ‘స్టాలిన్‌’లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు నటి త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ పంచుకోలేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’లో మొదట త్రిషనే కథానాయికగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు. కాగా, ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నయన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష కూడా ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని