Ayushmann Khurrana: అలనాటి హీరోయిన్‌ను తలచుకొని పాట పాడిన ఆయుష్మాన్‌ ఖురానా

ప్రముఖ నటి శ్రీదేవి 58వ జయంతి సందర్భంగా బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఆమెను గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు తన పాత వీడియోను ఒకటి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ‘లమ్‌హే’ సినిమాలోని ‘కబీ మేన్‌ కహున్‌’ అనే పాటను స్వయంగా పాడిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరిచాడు

Published : 13 Aug 2021 20:41 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి శ్రీదేవి 58వ జయంతి సందర్భంగా బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఆమెను గుర్తు చేసుకున్నాడు. తన పాత వీడియోను ఒకటి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ‘లమ్‌హే’ సినిమాలోని ‘కబీ మేన్‌ కహున్‌’ అనే పాటను స్వయంగా పాడిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తుండగా.. ఖురానా ఆలపిస్తున్నట్లుగా ఉంటుంది. ‘లమ్‌ హే’ సినిమాలో ఈ పాటను లతా మంగేష్కర్‌, హరిహరన్‌ పాడారు. యశ్‌ చోప్రా 1991లో తెరకెక్కించిన చిత్రంలో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆయుష్మాన్‌ ఖురానా అద్భుతంగా పాడతాడని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ తన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా పోస్టు చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు కిషోర్‌కుమార్‌ జయంతి సందర్భంగా కూడా ఒక పాటను పాడి నెటిజన్లను అలరించారు. అతడి వ్యక్తిగత ఖాతాకు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. ఖురానా ప్రస్తుతం అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డాక్టర్‌ జీ’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఖురానా సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని