‘బెల్‌ బాటమ్‌’, ‘83’, ‘షేర్షా’ రెడీ

కరోనా నిబంధనలు సడలించాక చిత్రసీమలో షూటింగ్‌ పనులు వేగవంతమయ్యాయి. కొత్త చిత్రాల హుడాహుడి పెరిగింది. కరోనా మహమ్మారితో వాయిదా పడిన చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు సన్నద్ధమయ్యాయి.

Published : 20 Feb 2021 18:13 IST

ముంబయి‌: దేశంలో కరోనా నిబంధనలు సడలించాక చిత్రసీమలో షూటింగ్‌ పనులు వేగవంతమయ్యాయి. కొత్త చిత్రాల సందడి పెరిగింది. కరోనా మహమ్మారితో వాయిదా పడిన చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు సన్నద్ధమయ్యాయి. తాజాగా బాలీవుడ్‌కి చెందిన పలు చిత్రాలు తమ విడుదల తేదీని ప్రకటించాయి. క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్న చిత్రం ‘83’. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్, ఫాంటమ్‌, నదియాద్‌వాలా, విబ్రీ మీడియాలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాని జూన్‌ 4, 2021న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా ఆయన భార్య రోమి పాత్రలో దీపికా పదుకొణె నటించింది. 

ఇక సిద్దార్థ మల్హోత్రా, విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘షేర్షా’. కియారా అడ్వాణి కథానాయిక. ధర్మ ప్రొడక్షన్స్, కాష్‌ ఎంటర్‌టైన్‌ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాని ఈ ఏడాది జులై 2న  విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే వరసలో యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్ నటిస్తున్న గ్యాంగస్టర్‌ చిత్రం  ‘బెల్‌ బాటమ్‌’. రంజిత్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ - ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాణీకపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా మే 28న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని