Hardik Pandya: హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు.
ఇంటర్నెట్డెస్క్: హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని దక్షిణాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, బుమ్రా వంటి అనుభవజ్ఞులున్న చోట అటువంటి శైలి జట్టుకు పెద్దగా ఉపయోగపడదని పేర్కొన్నాడు. ముంబయి జట్టులో తీవ్ర అసంతృప్తులున్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.
‘‘ముంబయి జట్టు ఈ సీజన్లో చాలా నిరాశపర్చింది. వారు నాకౌట్ దశకు చేరుకోవాలని నేను బలంగా కోరుకున్నాను. కానీ, సాధ్యం కాలేదు. ఎక్కడో లోపం జరుగుతోంది. ఇటీవల రోహిత్ మాట్లాడుతూ..‘నేను చాలా మంది కెప్టెన్లతో కలిసి ఆడాను. నాకు ఇదేం కొత్తకాదు. ఏం అవసరమో మీరు అది చేయండి.. నేను కూడా నెలరోజులుగా అదే చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించాడు. మీరు ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
హార్దిక్ నాయకత్వం మైదానంలో ధైర్యంగా ఉన్నట్లున్నా.. అది ఓ రకంగా అహంకారపూరిత శైలి. అతడు మైదానంలో వ్యవహరిస్తున్న తీరు వాస్తవమైందని నేను అనుకోను. కానీ, తన కెప్టెన్సీ అలానే ఉండాలని అతడు అనుకొంటున్నాడు. ధోనీ మాదిరిగా చేద్దామని యత్నిస్తున్నాడు. అత్యంత అనుభవజ్ఞులున్న చోట అందరూ దానిని అంగీకరించరు. యువకులే అధికంగా ఉన్న గుజరాత్ టైటాన్స్లో ఈ శైలి పనిచేస్తుంది. అనుభవం లేనివారు అటువంటి నాయకత్వాన్ని ఇష్టపడతారు. అంతేగానీ, రోహిత్, బుమ్రా వంటి వారున్న జట్టులో ఇది మంచి వ్యూహం కాదని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నాడు.
ముంబయి జట్టులో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులను సీనియర్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు, జట్టు కోచింగ్ సిబ్బంది సమావేశమయ్యారు. దీనిలో సీనియర్లు, జట్టు మేనేజ్మెంట్ బృందంతో ఒక్కొక్కరుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవల దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఓటమికి టాప్ స్కోరర్ తిలక్ వర్మను హార్దిక్ తప్పుపట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతడికి మ్యాచ్ పరిస్థితిపై అవగాహన లేకపోవడమే ఓటమికి కారణమని హార్దిక్ వ్యాఖ్యానించాడు. ‘‘అక్షర్ పటేల్ (డీసీ బౌలర్) ఓ లెఫ్ట్ హ్యాండర్కు (తిలక్) బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో సదరు బ్యాటర్ అతడిపై దూకుడుగా ఆడి ఉండాల్సింది. ఆటపై ఉండే ఈ చిన్న అవగాహన లోపించడంతో మ్యాచ్లో మూల్యం చెల్లించుకున్నాం’’ అని పేర్కొన్నాడు. ఏకపక్షంగా ఓటమి మొత్తాన్ని తనపై నెట్టేయడంతో తిలక్ వర్మ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?