Adhik Ravichandran: నటుడు ప్రభు కుమార్తెతో యువ దర్శకుడి వివాహం

యువ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ (Adhik Ravichandran) వివాహం జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఆయన పెళ్లి వేడుకలో సినీ తారలు సందడి చేశారు.

Updated : 15 Dec 2023 13:52 IST

చెన్నై: ‘మార్క్‌ ఆంటోనీ’ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ (Adhik Ravichandran) ఓ ఇంటివాడు అయ్యారు. కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యతో ఆయన వివాహం జరిగింది. చెన్నైలోని ఫంక్షన్‌ హాల్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో శుక్రవారం ఉదయం వీరి వివాహం జరిగింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రీమేక్స్‌తో డీలా.. షారుక్‌ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్‌ తీరిలా!

నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ విశాల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘మై డార్లింగ్‌ అధిక్‌, నా సోదరి ఐశ్వర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు.. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అధిక్‌.. నా సోదరిని ఒక యువరాణిలా చూసుకో’’ అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం కొత్త జంటకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2015లో విడుదలైన ‘త్రిష ఇల్లానా నయనతార’తో అధిక్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ‘దబాంగ్‌ 3’కి తమిళ డైలాగ్స్‌ రాశారాయన. ఈ ఏడాది విడుదలైన ‘మార్క్ ఆంటోనీ’తో ఆయన తొలి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే ఆయన అజిత్‌తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ నటుడు ప్రభు తెలుగువారికి సుపరిచితులు. చంద్రముఖి, ‘ఘర్షణ’ (1988), డ్యూయెట్ (1994), ‘కథానాయకుడు’, ‘డార్లింగ్‌’, ‘ఆరెంజ్‌’, ‘శక్తి’, ‘బెజవాడ’, ‘ఒంగోలు గిత్త’ వంటి తెలుగు చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని