Puri Musings: నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్.
హైదరాబాద్: ‘ఎవరైనా నిన్ను అవమానిస్తే, చిరునవ్వుతో వాళ్లకు సమాధానం చెప్పు. అంతేకానీ, వాళ్లతో వాదనకు దిగకు. అలా దిగితే అవతలి వ్యక్తి గెలిచినట్లు’ అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) పేరుతో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఇన్సల్ట్’ (అవమానం) అనే విషయం గురించి మాట్లాడారు.
‘‘లైఫ్లో చాలాసార్లు మనం అవమానానికి గురవుతాం. ఎవరో ఏదోఒక మాట అంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధ పడకూడదు. అప్పుడే హుందాగా ఉండాలి. ఇక్కడ మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.
- నెం.1: ఏ సందర్భంలో అది జరిగిందో అర్థం చేసుకోండి. ఎవరు నిన్ను అవమానించారు? నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తా? నీ మేలు కొరుకునేవాడా? నీ సహోద్యోగా? నీ బాస్? నీ శత్రువా? ముక్కూ మొహం తెలియనివాడా? ఒక్కోసారి కన్న తండ్రి కూడా అవమానకరంగా మాట్లాడవచ్చు. ‘నీకు పెట్టే తిండి కూడా దండగ’ అని తిట్టవచ్చు.
- నెం.2: ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు? ఏదైనా చిన్న విషయానికే అవమానించారా? వ్యక్తిగత జీవితం గురించి చులకనగా మాట్లాడారా? నీ జాతి గురించి కించపరిచేలా ఏమైనా అన్నారా?
- నెం.3: నిన్ను ఎక్కడ అవమానించారు? మీరు ఇద్దరే ఉన్నప్పుడా? పబ్లిక్ గానా? లేక సోషల్మీడియా వేదికగా అన్నారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలి.
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండి. నువ్వు కోప్పడితే ఎదుటివాడు గెలిచినట్టే. నువ్వు రియాక్ట్ అయితే, ఆ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని, నిన్ను ఇంకా రెచ్చగొడతాడు. అలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి. అది పవర్ఫుల్ టూల్. ఒక చిరునవ్వు నవ్వండి. వాడిని మనం సీరియస్గా తీసుకోలేదని తెలియాలి. ఏదైనా చెప్పాలనిపిస్తే ‘నన్ను అవమానపరిచేలా మాట్లాడినందుకు థ్యాంక్యూ. ఇలా జరిగిన ప్రతిసారీ ఎదిగాను’ అని చెప్పండి. మిమ్మల్ని నిందించిన ప్రతిసారీ వాడిని వదిలేయండి. (Puri Musings) ‘బెస్ట్ రెస్పాన్స్ ఈజ్ నో రెస్పాన్స్’. మీరు వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోతే, మిమ్మల్ని అవమానపరిచేవాడు తన ఆసక్తిని కోల్పోతాడు. కొన్నిసార్లు కొన్ని పరాభవాల వల్ల మనం మారతాం. అవి మనకు ఉపయోగపడతాయి. మీ మంచి కోరుకునేవారు మిమ్మల్ని అవమానిస్తే ఎందుకు చేశారో గుర్తించండి. వాళ్లేదో అన్నారు కాబట్టి, పంచ్ విసిరి అక్కడే గెలవాలని చూడొద్దు. గెలుపు ముఖ్యం కాదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నామన్నది ముఖ్యం. అవమానం ఎప్పుడూ ఎదుటివాడి కంటే బాగా ఎదగాలన్న కసిని పెంచుతుంది. కించపరిచేలా మాట్లాడినప్పుడు వాదనకు దిగొద్దు. మనకు జరిగిన ప్రతీ అవమానాన్ని సక్సెస్ కోసం వాడుకోవాలి. అవమానం చాలా విలువైనది. దాన్ని భద్రంగా దాచుకో వాడుకో..’’ అని పూరి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్గేల్తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..