దిశను ఓకే చేశారా?

తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. అందులో ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి

Published : 01 Mar 2021 13:06 IST

ముంబయి: తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. అందులో ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛత్రపతి’ ఒకటి. అక్కడ బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా దిశాపటానీ దాదాపుగా ఖాయమైనట్టే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

జాన్వీ కపూర్‌తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. దిశా హిందీతోపాటు, తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పూరి దర్శకత్వం వహించిన ‘లోఫర్‌’ సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని