శిరీష్‌.. సాయితేజ్‌.. ఇప్పుడు వరుణ్‌ తేజ్..?

ఇటీవల విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఏహీరోతో చేయబోతున్నారో అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మెగా కాంపౌండ్‌...

Published : 10 Jan 2020 22:10 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఏ హీరోతో చేయబోతున్నారా? అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన అల్లు శిరీష్‌ , సాయితేజ్‌లను డైరెక్ట్‌ చేసిన మారుతి మరోసారి మెగా హీరోతోనే సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మెగా హీరో ఎవరో కాదండీ.. వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ‘బాక్సర్‌’ సినిమాలో బిజీగా ఉన్న వరుణ్‌ త్వరలో మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారంటూ టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని