Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు..
ప్రపంచ సుందరి- 2024 (Miss World Competitions 2024) పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం సాయంత్రం ఆ ప్రశ్నకు తెర పడనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అందాల పోటీ ఎప్పుడు మొదలైంది? తొలి విజేత ఎవరు? ఇప్పటి వరకు భారత్ ఎన్ని కిరీటాలు దక్కించుకుంది? తదితర విశేషాలు తెలుసుకుందాం..
- ఇదొక వేడుకలాంటిది. అన్ని దేశాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. 1951లో తొలిసారి ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ పోటీలు బాహ్య సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. అందమొక్కటే ఉంటే ఇక్కడ నెగ్గుకురావడం కష్టం. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. సమయస్ఫూర్తితో మెలగాలి. అందుకే ఆ వేదికపై విజయకేతనం ఎగరేసిన వారిని ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అని ప్రశంసిస్తుంటారు.
- బ్రిటన్ ఫెస్టివల్లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లే ‘బికినీ కాంటెస్ట్’ (1951) నిర్వహించారు. దానికి మంచి ఆదరణ లభించింది. తర్వాత, బ్రిటిష్ ప్రెస్ ఆ ఈవెంట్కు ‘మిస్ వరల్డ్’ అని పేరు పెట్టింది. మరోవైపు, బికినీ ధరించి, ప్రదర్శనలివ్వడమేంటని చాలామంది విమర్శలు గుప్పించారు.
- ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలు దేశాలు నిరాకరించాయి. దీంతో, బికినీ స్థానంలో స్విమ్ సూట్ను ప్రవేశ పెట్టారు. తర్వాత మరికొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. మోర్లే మరణానంతరం (2000) ఆయన భార్య జూలియా, నేపాల్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త దీపేంద్ర గురంగ్ ఈ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు.
- ఈ పోటీలను 1959 నుంచి బీబీసీ ప్రసారం చేయడం ప్రారంభించింది. 60, 70ల్లో అత్యధిక మంది వీక్షించిన ప్రోగ్రామ్గా రికార్డు నెలకొల్పింది.
- స్వీడన్కు చెందిన కికీ హకాన్సన్ (First Miss World) మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తొలి మహిళగా నిలిచారు.
- ఈ పోటీల్లో విజయం సాధించిన తొలి నల్లజాతి మహిళ జెన్నీఫర్ హోస్టన్ (గ్రెనడా). 1970 మిస్ వరల్డ్ ఆమె.
- అవివాహిత మహిళలకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. సాధారణంగా కనీస వయసు 17, గరిష్ఠ వయసు 27. కొన్ని దేశాల వారికి ఆ ప్రాతిపదిక మారుతుంది. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచే ప్రాతినిధ్యం వహించే వీలుంది. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు.
- గ్లోబల్ ఫైనల్, ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ పేరిట వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. అనంతరం, ‘బీచ్ బ్యూటీ’, ‘మిస్ టాలెంట్’, ‘మిస్ స్పోర్ట్’, ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ వంటి యాక్టివిటీస్ నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్ రౌండ్కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. 2003 నుంచి ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి.
- 2005లో ‘కాంటినెంటల్ క్వీన్స్ ఆఫ్ బ్యూటీ’ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఒక్కో న్యాయ నిర్ణేత తన 40మంది కంటెస్టెంట్లను ఐదుగురు చొప్పున ఎనిమిది బృందాలుగా విభజిస్తారు. ఎక్కువ పాయింట్లు ఎవరైతే సాధిస్తారో వారిని ‘కాంటినెంటల్ క్వీన్ ఫర్ ది రీజియన్’ అంటారు. ఒకవేళ భారతీయ మహిళ గెలిస్తే ‘కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ ఫర్ ఇండియా’ అని పేర్కొంటారు.
- తొలినాళ్లలో ముత్యాలు పొదిగిన కిరీటాలను విజేతలకు అందించేవారు. కొన్నేళ్లుగా ముత్యాలు స్థానంలో వజ్రాలు చేర్చారు.
- ఈ పోటీలకు 1996లో భారత్ ఆతిథ్యమిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ పోటీల్లో వెనిజులాకు చెందిన ఇరెన్ స్క్లివా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ ఏడాది నుంచే ఇంటర్నెట్ కవరేజ్ను తీసుకొచ్చారు. మిస్ వరల్డ్ వివరాలు పొందుపరిచిన వెబ్సైట్ను స్క్లివా లాంచ్ చేశారు.
- మళ్లీ ఇన్నాళ్లకు ఈ పోటీలు భారత్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9న మొదలై, మార్చి 9తో ముగియనున్నాయి. దిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికలుగా మారాయి. ఇప్పుడు జరుగుతున్నది 71వ ఎడిషన్.
- భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు కిరీటాన్ని అందుకున్నారు. రీటా ఫరియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్తోపాటు వెనిజులా ఉంది.
- తాజా పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. మిస్ ఇండియా వరల్డ్- 2022 సిని శెట్టి (Sini Shetty) భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు రౌండ్లలో సత్తా చాటిన ఆమె కిరీటం దక్కించుకోవాలని ఆకాంక్షిద్దాం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు