Liger : ‘లైగర్’ ఫ్లాప్.. నష్టాలపై పూరీ జగన్నాథ్ ఏమన్నారంటే..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘లైగర్’. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. వీరిద్దరి కాంబినేషన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అంతేకాదు, బయ్యర్లకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో నష్టపోయిన డబ్బును తిరిగి ఇస్తానని పూరి జగన్నాథ్ హామీ ఇచ్చారట. సెప్టెంబర్30 లోగా ఇందుకు సంబంధించిన మొత్తం లావాదేవీలు పూర్తి చేస్తానని చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ‘లైగర్’ పరాజయంతో విజయ్తో చేయాల్సిన ‘జనగణమణ’ కూడా పక్కకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాస్త విరామం తీసుకుని ‘లైగర్’ నుంచి బయటపడే ఆలోచనలో ఉన్నారు పూరి జగన్నాథ్. ఆ తర్వాత తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను ప్రారంభించనున్నారు. తన నివాసాన్ని కూడా ముంబయి నుంచి గోవాకు మార్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం