Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..
నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi) సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. 2006లో ‘పద్మ భూషణ్’ అందుకున్న ఆయన్ను.. తాజాగా పౌర పురస్కారాల్లో రెండో అత్యున్నతమైన ‘పద్మ విభూషణ్’ (Padma Vibhushan) వరించింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణాన్ని చూద్దాం.. (Padma Vibhushan Chiranjeevi)..
తాత మాటలు నిజం చేసి..
1955 ఆగస్టు 22న నరసాపురంలోని (పశ్చిమ గోదావరి) మిషనరీ ఆస్పత్రిలో చిరంజీవి జన్మించారు. తాత (అంజనాదేవి తండ్రి) జె.ఆర్.కె. నాయుడు శివుడి భక్తుడు కావడంతో ఆయనకు శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. చాలా హుషారుగా ఉండే తన మనవడు ఏదో సాధిస్తాడని తాత నమ్మకంగా ఉండేవారు. ‘నువ్వు గొప్పవాడివి అవుతావు నాన్నా.. ఈలోకం నీకు జేజేలు పలుకుతుంది’ అంటూ మనవడిని చూసి మురిసిపోయేవారు. తాత చెప్పిన మాటలు అప్పుడు వరప్రసాద్కు అర్థం కాలేదు గానీ.. తర్వాత అవి నిజమయ్యాయి. రామాయణం, భారతం, భాగవతాల గురించి తల్లి చెబుతుంటే ఆసక్తిగా వినేవారు. నాటకాలు ఎక్కువగా చూసేవారు. అప్పుడప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లకు వెళ్లి ఇంటికొచ్చాక తమ్ముళ్లు, చెల్లెళ్ల ముందు వాటిని అనుకరించేవారు. అలా సుమారు ఆరేళ్ల వయసులోనే నృత్యంపై మనసు పడ్డారు. ‘డ్యాన్స్ అంటే చిరంజీవిదే’ అని ఆరు పదుల్లోనూ అందరితో అనిపించుకుంటున్నారు. పెద్ద కొడుకుని పోలీసు అధికారి చేయాలని తండ్రి, వైద్యుడిని చేయాలని తల్లి అనుకునేవారు. ఒకవేళ ఆయన ఈ రెండింటిలో ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఉండుంటే.. ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రియులు దాన్ని ఊహించడం కష్టమే!
నటనకు బీజం..
హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా ఓ మిత్రుడు రాసిన నాటిక రిహార్సల్స్ చూసేందుకు వరప్రసాద్ వెళ్లారు. అనుకోకుండా అందులోని పరంధామయ్య పాత్రను తానే పోషించాల్సి వచ్చింది. వీక్షకుల చప్పట్లతోపాటు ‘విజేత’గా బహుమతి అందుకున్నారు. వరప్రసాద్ నటనకు బీజం పడింది అక్కడే. ఆ దృశ్యాలను చూసి తల్లి, తండ్రి ఉప్పొంగిపోయారు. తల్లి కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో చేరిన ఆయన.. నరసాపురంలోని వై.ఎన్.ఎం. కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో.. ‘రాజీనామా’ నాటికలో ఛైర్మన్ పాత్ర పోషించి మరో బహుమతి అందుకున్నారు. ఎన్.సి.సి.లో సీనియర్ క్యాడెట్ కెప్టెన్గా వ్యవహరించారు. ఓ ఏడాది.. దిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రా జట్టు తరఫున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలేరమ్మ జాతరను ప్రదర్శించారు. తిరుగు ప్రయాణంలో రైలుకంటే వేగంగా వరప్రసాద్ ఆలోచనలు తిరిగాయి. ‘సినిమాల్లోకి వెళ్లడం కరెక్టేనా? అసలు అది ఎలా సాధ్యం?’.. ఇలా సందేహాల నడుమే ఇంటికి చేరుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఎట్టకేలకు నటుడిని అవుతానంటూ తండ్రికి చెప్పాలనుకున్నారు. ఈలోగా.. నటనలో శిక్షణ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు అప్లికేషన్ పంపగా ఇంటర్వ్యూకు రావాలంటూ లేఖ వచ్చింది. దాన్ని చూసి తండ్రి.. వరప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలోని సాధకబాధకాలు చెప్పి పరోక్షంగా వెళ్లొద్దన్నారు. ‘నేను వెళతాను నాన్నా..’ అంటూ వరప్రసాద్ మద్రాస్ రైలు ఎక్కారు.
అలా చిరంజీవిగా..
మద్రాసులో జరిగిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకు హాజరై, శిక్షణకు ఎంపికయ్యారు. అదే ఇంటర్వ్యూకు వెళ్లిన హరిప్రసాద్, సుధాకర్లతో కలిసి ఓ గదిలో ఉండేవారు. మరో ఐదు నెలల్లో శిక్షణ పూర్తికావాల్సి ఉండగా ‘పునాది రాళ్లు’లో నటించే అవకాశం అందుకున్నారు. ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకునేందుకు మొగల్తూరు వెళ్లారు. అప్పుడే పేరును కూడా మార్చుకోవాలనుకున్నారు. అమ్మ, నాన్న, తమ్ముళ్లు, చెల్లెళ్లు చెప్పిన ఏ పేరూ నచ్చలేదు. ‘చిరంజీవి..’ అంటూ తన కొచ్చిన కల గురించి చెబుతూ ‘చిరంజీవి అంటే హనుమంతుడే కదమ్మా?’ అని అడిగారు. అవును బాబు.. ఇకపై నీ పేరు చిరంజీవి అంటూ అంజనాదేవి కొడుకుకి మళ్లీ నామకరణం చేశారు. ‘పునాది రాళ్లు’ చిత్రీకరణకు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ టైమ్లో ‘ప్రాణం ఖరీదు’కు ఎంపికయ్యారు. రెండు చిత్రాల చిత్రీకరణ ఒకేసారి పూర్తయినా ‘ప్రాణం ఖరీదు’ (1978) ముందుగా విడుదలైంది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ దర్శకులు బాపు, కె. బాలచందర్ తమ చిత్రాల్లో (మన ఊరి పాండవులు, ఇది కథ కాదు) అవకాశాలు ఇవ్వడంతో చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు.
ప్రేక్షక హృదయాల్లో ‘ఖైదీ’
నటుడిగానే కాదు వ్యక్తిగాను చిరంజీవి ‘అందరివాడు’ అయ్యారు. ‘మనవూరి పాండవులు’తో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాదు.. తొలి పారితోషికాన్ని ఆ చిత్రంతోనే అందుకున్నారు. వరుస అవకాశాలొస్తున్నప్పటికీ.. అవన్నీ వేరే హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్. వాటిని తిరస్కరిస్తే నటుడిగా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో నటించేవారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్.. ఇలా ఎందరో హేమాహేమీల్లాంటి వారు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డ్యాన్స్, ఫైట్స్లో కొత్త ఒరవడి సృష్టించి ప్రేక్షకుల హృదయాల్లో ‘ఖైదీ’ అయ్యారు. చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఖైదీ ముందు.. ఖైదీ తర్వాత’ అనాల్సిందే. 1980, 1983లో అత్యధికంగా 14 చిత్రాల్లో నటించారు. ‘చిరంజీవి కళాకారుడు కాదు కళాకార్మికుడు’ అని రావుగోపాలరావు, ‘ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు, అలుపెరగని సూర్యుడు చిరంజీవి’ అని బ్రహ్మానందం ఇందుకే అన్నారేమో! తొలినాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరు.. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో మెగాస్టార్గా మారారు.
చెప్పింది చేశారు..
నట శిక్షణలో ఉన్న సమయంలో ‘పూర్ణా పిక్చర్స్’ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ రివ్యూలు ఇస్తుండేవారు. అలా ఓ సినిమా చూసేందుకు వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్, మేకప్మ్యాన్లు ఆ ముగ్గురిని లేపారు. చేసేదేమీలేక వారు నిల్చొనే సినిమాను చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా.. ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. చూడండి ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరంజీవి ఆవేశంలో చేసిన ఆ ‘ఛాలెంజ్’ను నెగ్గారు. ఈ నంబర్లపై చిత్ర వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ‘ఇండస్ట్రీకి నంబర్ 1 హీరో చిరంజీవి గారే’ అని మహేశ్బాబు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక సేవలోనూ చిరంజీవిది ప్రత్యేక ముద్ర. ఛారిటబుల్ ట్రస్టు, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించారు. రాజకీయాల్లోకీ వెళ్లొచ్చారు. నిర్మాతగానూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. కరోనా వేళ సినీ కార్మికులను ఆదుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు.
పురస్కారాలు..
వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా నిలిచిన చిరంజీవి.. 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా ‘సమ్మాన్’ అవార్డు పొందారు. 90ల్లో అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) తీసుకున్న తొలి భారతీయ నటుడిగా, ‘ఆస్కార్’ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పేరొందారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ పురస్కారం (స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర) అందుకున్నారు. తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు (2016), ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2022), పద్మ భూషణ్ (2006) తీసుకున్నారు. తాజాగా ‘పద్మ విభూషణ్ చిరంజీవి’గా మరో మెట్టు ఎక్కారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ (156వ సినిమా)లో నటిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు