Mehreen: నాగ్‌కు జోడీగా మెహ్రీన్‌?

కథానాయకుడు నాగార్జున.. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది.

Published : 05 Dec 2021 15:13 IST

థానాయకుడు నాగార్జున.. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో నాగ్‌కు జోడీగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో అమలాపాల్‌ ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ఛాన్స్‌ యువ కథానాయిక మెహ్రీన్‌ వరించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్‌ నచ్చడంతో నాగ్‌ సరసన నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని