Varalakshmi: ‘మైఖేల్‌’ కోసం వరలక్ష్మి

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రంజిత్‌ జయకోడి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘మైఖేల్‌’. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌  మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Updated : 21 Jan 2022 07:00 IST

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రంజిత్‌ జయకోడి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘మైఖేల్‌’. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌  మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. ‘‘విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. సందీప్‌ కిషన్‌ పాత్ర చాలా కొత్తగా ఇంటెన్సిటీతో ఉండనుంది. దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ,    మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని