Ponniyin Selvan: ‘పొన్నియిన్ సెల్వన్2’.. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అధ్యాయం!
మణిరత్నం (maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin selvan) రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో ఏం చూపించనున్నారని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ponniyin Selvan: ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తన కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన తొలి భాగం బాక్సాఫీస్ వద్ద అలరించగా, ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పార్ట్ -1లో మిగిలిపోయిన అనేక సందేహాలకు లభించే సమాధానాల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే..?
నందిని గతమేంటి..?
‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan)లో కీలకపాత్రధారి.. మొత్తం కథకు సూత్రధారి నందిని (Aishwarya Rai). చిన్నతనంలోనే ఆమెను చూసి ప్రేమలో పడతాడు ఆదిత్య కరికాలుడు. ఆమెతో జీవితాన్ని ఊహించకుంటాడు. అయితే, అనాథ అయిన నందినికి చోళ సామ్రాజ్య రాణి అయ్యే అర్హత లేదని భావించిన ఆదిత్య చెల్లి కుందవై (త్రిష) (Trisha) మహారాణితో చెప్పి నందిని రాజ్యం విడిచి వెళ్లిపోయేలా చేస్తుంది. అలా, వెళ్లిపోయిన నందిని పాండ్య రాజు వీర పాండ్యుడిని వివాహం చేసుకున్నట్లు.. ఆదిత్య చేతిలో అతడు మరణించినట్లు.. ఆదిత్య మీద కోపంతో ఆమె చోళ రాజ్య ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్ (శరత్ కుమార్)ను వివాహమాడి తంజావూరుకు వచ్చినట్లు పార్ట్-1లో చూపించారు. అలాగే, ఆమె చోళ సామ్రాజ్య పతనం, మరీ ముఖ్యంగా ఆదిత్యుడిపై విజయం, అరుణ్మొళి వర్మన్ (జయం రవి) మరణం కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు ‘పొన్నియిన్ సెల్వన్’లో చూపించిన విషయం తెలిసిందే. అయితే, నందిని గతం విషయంలో ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమెకు ఆదిత్య అంటే ఎందుకంత కోపం? చిన్నతనంలో చోళ సామ్రాజ్యం నుంచి వెళ్లిపోయిన ఆమె పాండ్య రాజుని ఎలా పెళ్లి చేసుకుంది? పెద్ద పళవేట్టురాయర్తో ఆమెకు బంధం ఎలా ఏర్పడింది? అరుణ్మొళి వర్మన్ను ఆమె ఎందుకు చంపాలనుకుంది?
మధురాంతకుడు రాజ్యం చేజిక్కుకుంటాడా..?
చోళ రాజ్య చక్రవర్తి సుందరచోళుడి (ప్రకాశ్రాజ్) అన్న కొడుకే మధురాంతకుడు (రెహమాన్). తన తండ్రి మరణం తర్వాత రాజ్యాధికారం లెక్కప్రకారం తనకే రావాలని భావించిన మధురాంతకుడు.. చోళ రాజ్య ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్తో చేతులు కలిపి రాజ్యం కోసం పన్నాగాలు పన్నుతుంటాడు. తన బాబాయ్ సుందరచోళుడు, ఆయన పిల్లలు ఆదిత్య, అరున్మొళిని తప్పించి.. తానే రాజుస్థానంలో కూర్చోవాలనే ఆశతో సామంత రాజులతో కలిసి మంతనాలు జరుపుతుంటాడు. మరి, ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమయ్యాయి? మధురాంతకుడు చోళ సామ్రాజ్య రాజు అవుతాడా? లేదా తాను పన్నిన పన్నాగంలో తానే తనువు చాలిస్తాడా?
పెద్ద పళవేట్టురాయర్ ఎందుకు శత్రువయ్యాడు..?
చోళ సామ్రాజ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తోన్న ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్ (శరత్ కుమార్). రాజ కుటుంబ విశ్వాసాన్ని పొందిన అతడు ఉన్నట్టుండి అదే కుటుంబానికి వ్యతిరేకిగా మారడానికి కారణం ఏమిటి? వయసులో తనకంటే ఎంతో చిన్నదైన నందినిని అతడు ఎందుకు వివాహం చేసుకున్నాడు? మధురాంతకుడికి సాయం చేయడం వెనకున్న ప్రధాన కారణమేమిటి?
అరుణ్మొళి ఏమయ్యాడు?
చోళ సామ్రాజ్య మరో యువరాజు అరుణ్మొళి వర్మన్ (Ponniyin Selvan) పడవ ప్రమాదం జరిగి సముద్రంలో పడి చనిపోయినట్లు ‘పొన్నియిన్ సెల్వన్’ క్లైమాక్స్లో చూపించారు. ఆయన నిజంగా మృతి చెందాడా? లేదా బతికే ఉన్నాడా? ఒకవేళ బతికితే తనపై కుట్ర పన్నిన పెద్ద పళవేట్టురాయర్ని ఆయన ఏం చేశాడు? శత్రు సైన్యం పాండ్యులను నుంచి ఎలా తప్పించుకున్నాడు? అలాగే తనని చంపాలని చూసిన నందినికి ఎలాంటి బుద్ధి చెప్పాడు? అరుణ్మొళి వర్మన్ ఎవరిని వివాహం చేసుకున్నాడు?
ఆ ముసలావిడ ఎవరు?
అరుణ్మొళి ప్రమాదంలో ఉన్నప్పుడల్లా అతడిని కాపాడటానికి ఒక ముసలావిడ వచ్చినట్లు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan)లో చూడొచ్చు. చివరికి అరుణ్మొళి సముద్రంలో పడిపోయినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన్ని వెతుక్కుంటూ సముద్రంలోకి వెళ్తుందావిడ. ఇంతకీ ఆమె ఎవరు? అరుణ్మొళి అంటే ఆమెకు ఎందుకంత ఇష్టం? ఆమెకు అరుణ్మొళికి ఉన్న అనుబంధం ఏమిటి?
వందియదేవన్ వివాహం చేసుకునే చోళ రాజకుమారి ఎవరు?
గంభీరంగా సాగే ‘పొన్నియిన్ సెల్వన్’లో కథలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పాత్ర వల్లవరాయ వందియదేవన్(కార్తి). రెండో భాగంలో కూడా ఈ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. ఇక లంకను వీడి అరుణ్మొళి వర్మన్ వెళ్తున్న సమయంలో వల్లవరాయుడిని తన తలపాగాను అలకరించి ‘నువ్వు కూడా రాజువు అవుతావు. చోళ యువరాణి నీ పక్కన నిలబడుతుంది’ అంటాడు. మరి వల్లవరాయుడిని వరించే ఆ చోళ యువరాణి ఎవరు? కుందవైని అతడు వివాహం చేసుకుంటాడా? లేదా?
కుందవై రాజనీతి కొనసాగుతుందా?
తన రాజకీయ చతురతతో కథను మలుపుతిప్పే పాత్ర ‘కుందవై’. సామంతులను కూడదీసి మధురాంతకుడిని రాజును చేయాలనుకున్న పెద పళవేట్టురాయర్ కుట్రను తన తెలివి తేటలతో భగ్నం చేస్తుంది. సామంతరాజుల కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి, అప్పటికి గండం గట్టెక్కిస్తుంది. రెండో భాగంలో నందిని కీలకం కావడంతో ఆ పాత్రను ఢీకొట్టే మహిళ కుందవై మాత్రమే. మరి చోళ రాజ్య పతనానికి సాగే కుట్రలను భగ్నం చేయడంలో కుందవై పాత్ర ఏంటో చూడాలి.
దెబ్బ తిన్న ఏనుగు ప్రమాదమా..?
సామ్రాజ్య విస్తరణలో భాగంగా చోళ యువరాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్) (Vikram) రాష్ట్రకూటులపై పోరాటం చేస్తాడు. అలా, ఓ యుద్ధంలో రాష్ట్రకూట రాజు కార్తికను ఆదిత్య ప్రాణాలతో వదిలేస్తాడు. ప్రాణభిక్షను ఇష్టపడని కార్తిక..‘‘ఆదిత్యా.. తప్పు చేస్తున్నావు గాయపడ్డ ఏనుగే పులికి అతిపెద్ద శత్రువు’’ అని హెచ్చరించినట్లు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan)లో చూపించారు. సినిమా మొదట్లో కనిపించిన కార్తిక ఆ తర్వాత మరెక్కడా కనిపించిన దాఖలాలు లేవు. మరి, కార్తిక వల్ల ఆదిత్య కరికాలుడికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా?
ఆదిత్య నందినిని చంపేస్తాడా?
తన సోదరుడు అరుణ్మొళి చనిపోయాడనే కోపంతో అతడి చావుకు కారణమైన నందినిని తానే చంపేస్తానని ఆదిత్య అంటాడు. చాలా ఏళ్ల తర్వాత తంజావూరుకు చేరుకున్న ఆదిత్య.. నిజంగానే నందినిని శిక్షిస్తాడా? లేదా ఆమె చేతిలో దెబ్బతింటాడా?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు మరి కొన్నిరోజుల్లో సమాధానాలు రానున్నాయి.
‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) పుస్తకాన్ని ఐదు విభాగాల్లో రచించాడు కల్కి కృష్ణమూర్తి. ఆ ఐదు వాల్యూమ్స్లోని సారాంశాన్ని కథగా మార్చుకుని మణిరత్నం రెండు భాగాలుగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని రూపొందించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చోళ సామ్రాజ్య వైభవాన్ని కేవలం రెండున్నర గంటల నిడివి గల సినిమాగా తెరకెక్కించడం కోసం మణిరత్నం మరెంతగానో శ్రమించారు. పాత్రల పరిచయం, వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. శుక్రవారం రానున్న ‘పొన్నియిన్ సెల్వన్ -2’ సైతం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్