సంకీర్ణ ధర్మం కోసమే నాపై విమర్శలు: చిరాగ్
లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకు ఎలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు.......
పట్నా: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకెలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ను సంతృప్తి పరిచేందుకే ఆ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తోందే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘నాన్న (రాంవిలాస్ పాస్వాన్) ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి ఆయన అంత్యక్రియల వరకూ ప్రధాని మోదీ నాకెంతో చేశారు. ఆయన చేసిన మేలును మరిచిపోలేను. నా వల్ల ఆయన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ధర్మం కోసం, నీతీశ్ను సంతృప్తి పరిచేందుకు నన్ను ఆయన ఎన్ని మాటలన్నా పర్వాలేదు’’ అని చిరాగ్ అన్నారు. తాను మోదీ తరహా అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ‘‘ఎల్జేపీకి, భాజపాను దూరం చేయడానికి నీతీశ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా సైతం తమ మధ్య ఎలాంటి అవగాహన లేదని చెప్పేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. నీతీశ్ మీద కోపం ఉన్నా సంకీర్ణ ధర్మాన్ని పాటించాలన్న ఉద్దేశంతో నాకు రోజుకో సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విషయంలో నీతీశ్.. తన మిత్రపక్షమైన భాజపాకు కృతజ్ఞతలు చెప్పాలి’’ అని చిరాగ్ చెప్పారు.
జేడీయూపై విభేదాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి ఎల్జేపీ బయటకొచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీయూకు పోటీగా అభ్యర్థులను నిలబెడుతోంది. అదే సమయంలో భాజపా అభ్యర్థుల నిల్చున్న స్థానాల్లో పోటీ చేయడం లేదు. అలాగే ఎన్నికల తర్వాత రాబోయేది భాజపా- ఎల్జేపీ ప్రభుత్వమేనని చిరాగ్ పాస్వాన్ పదే పదే చెబుతున్నారు. దీంతో ప్రజలను చిరాగ్ పాస్వాన్ గందరగోళ పరుస్తున్నారంటూ భాజపా మండిపడింది. ఎల్జేపీతో తమకు ఎలాంటి సంబంధాల్లేవని స్పష్టంచేసింది. దీనిపై చిరాగ్ ఈ విధంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.