కీలుబొమ్మలు తిరగ్గా లేనిది..నాతో ఏంటి సమస్య?
తనను మరోసారి చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని, తన కుమార్తె ఇల్తిజాను గృహ నిర్బంధంలో ఉంచారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
కశ్మీర్ యంత్రాంగంపై ముఫ్తీ విమర్శలు
శ్రీనగర్: తనను మరోసారి చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని, తన కుమార్తె ఇల్తిజాను గృహనిర్బంధంలో ఉంచారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. టెర్రర్ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బుధవారం పీడీపీ యువజన విభాగ అధ్యక్షుడు వహీద్ పర్రాను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ క్రమంలో వహీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడి యంత్రాంగం ముఫ్తీని అనుమతించలేదు.
‘నన్ను మరోసారి చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు. పుల్వామాలోని వహీద్ కుటుంబాన్ని కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. జమ్మూకశ్మీర్ యంత్రాంగం నాకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. భాజపా మంత్రులు, వారి కీలుబొమ్మలు కశ్మీర్లో ఇష్టారీతిగా తిరుగుతున్నారు. నా విషయంలో మాత్రమే భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయి’ అంటూ భాజపా, స్థానిక యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. అలాగే తన ఇంటి ముందు ఆగి ఉన్న మిలిటరీ వాహనం చిత్రాలను కూడా షేర్ చేశారు. దక్షిణ కశ్మీర్, మరీ ముఖ్యంగా ఉగ్రదాడులతో తీవ్రంగా ప్రభావితమైన పుల్వామాలో పీడీపీ పూర్వవైభవాన్ని కల్పించే విషయంలో వహీద్ కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచే ఆయన డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ కూడా వేశారు. వాటికి మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరగనున్నాయి.
ఈ వ్యవహారంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ‘మా గేట్ల ముందు ట్రక్కులు నిలపడం అక్కడి యంత్రాంగం విధానంగా మారింది. ఇటీవల నా తండ్రి విషయంలో కూడా ఇదే జరిగింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే