రాజస్థాన్ పాలిటిక్స్: కొనసాగుతున్న ఉత్కంఠ!
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్ వేసిన పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
సచిన్ పైలట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ముఖ్యమంత్రి అధ్యక్షతన మరోసారి సమావేశమైన సీఎల్పీ
జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్ వేసిన పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇదే సమయంలో, ఇరువర్గాల క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మద్దతుదారులు దాదాపు 100మంది ఎమ్మెల్యేలు గడిచిన వారం రోజులుగా జైపూర్లోని ఫెయిర్మోంట్ హోటల్లోనే మకాం వేసివున్నారు. తాజాగా అక్కడే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం(సీఎల్పీ) జరుగుతోంది. ఈవారం రోజుల్లో సీఎల్పీ సమావేశం కావడం ఇది మూడోసారి. అయితే ఈ సమావేశానికి రెబల్ నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు నిన్నటివరకూ ఉంచనా వేశారు. కానీ, తాజాగా రెబల్ నేత సచిన్ పైలట్ ఒక దద్దమ్మ అంటూ ముఖ్యమంత్రి గహ్లోత్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సచిన్ మరింత దూరమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సచిన్ వర్గం కూడా హైకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!