‘బెంజ్ మినిస్టర్ జయరాం’ అంటూ లోకేశ్ వీడియో
ఈఎస్ఐ స్కామ్ వెనుక అసలు సూత్రధారి మంత్రి గుమ్మనూరు జయరాం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
అమరావతి: ఈఎస్ఐ స్కామ్ వెనుక అసలు సూత్రధారి మంత్రి గుమ్మనూరు జయరాం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి మాత్రం ఈఎస్ఐ స్కామ్ నిందితుడు ఇచ్చిన బెంజ్ కారులో విలాసంగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ‘బెంజ్ మినిస్టర్ జయరాం’ అంటూ ఓ వీడియోను లోకేశ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజ్కారు బహుమతిగా ఇచ్చారంటూ తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని అయ్యన్న విమర్శించారు. దీనిపై మంత్రి జయరాం స్పందిస్తూ అయ్యన్న వ్యాఖ్యలను ఖండించారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అయ్యన్న చెప్పిన బెంజ్ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
‘ఏపీ మంత్రి కుమారుడికి బెంజికారు లంచం’
నా కుమారుడికి లక్షల్లో ఫ్యాన్స్: ఏపీ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్