కెప్టెన్ సాబ్.. సిద్ధూ చేత బిల్లు కట్టించండి..
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ విద్యుత్ బిల్లు బకాయిల సెగ పంజాబ్ ప్రభుత్వానికి తగులుతోంది. ఇప్పటికే రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ విద్యుత్ బిల్లు బకాయిల సెగ పంజాబ్ ప్రభుత్వానికి తగులుతోంది. ఇప్పటికే రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) శనివారం చురకలు అంటించింది. రూ.8 లక్షలకుపైగా విద్యుత్ బిల్లు బకాయి పడిన సిద్ధూపై దృష్టి సారించాలంటూ ట్వీట్ చేసింది. కొద్ది రోజులుగా సిద్ధు పలు అంశాలపై సొంత పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభంపైనా ఆయన పలుమార్లు సర్కారుపై బహిరంగ విమర్శలు చేయడం గమనార్హం.
సిద్ధూ అమృత్సర్లోని తన ఇంటికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్కు రూ.8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉంది. బిల్లు చెల్లింపునకు ఆఖరు తేదీ శుక్రవారంతో ముగిసినప్పటికీ ఆయన ఈ విషయంపై స్పందించలేదు. పైగా విద్యుత్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అదే రోజు ట్వీట్ చేశారు. సరైన చర్యలు తీసుకుంటే విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదంటూ అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పని గంటలు తగ్గించడం సహా పరిశ్రమలకు కరెంటు కోతలు విధించాలంటూ పంజాబ్ సీఎం గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే.
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా విద్యుత్ సంక్షోభం ప్రధాన సమస్యగా మారింది. దీంతో అన్ని పార్టీలు ఈ అంశాన్నే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సైతం ఈ అంశంపైనే దృష్టి పెట్టింది, అందులో భాగంగా వచ్చే ఏడాది నిర్వహించబోయే ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తామంటూ హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.