Nara Lokesh: జగన్‌ శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారు: లోకేశ్‌

పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

Updated : 21 Aug 2023 12:02 IST

అమరావతి: పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించారు. ఈ మేరకు మీడియా సంస్థలపై జగన్‌ కక్ష సాధింపును ఖండిస్తూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

పని భారం భరించలేక.. బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

‘‘తన పగను తీర్చుకోవడానికి జగన్‌ ప్రభుత్వ సంస్థలను వాడుతున్నారు. ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోంది. ప్రజల శ్రేయస్సు కోసమైతే పోలవరం కట్టండి.. అమరావతిని నిర్మించండి. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి. ప్రజలను చైతన్యం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి’’ అని లోకేశ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని