CM Jagan: గవర్నర్తో సీఎం జగన్ భేటీ.... దిల్లీ టూర్పై చర్చ?
ఇటీవలే దిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. సతీమణి భారతితో కలిసి రాజ్భవన్కు వచ్చిన సీఎం.. తొలుత గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్తో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు....
అమరావతి: ఇటీవలే దిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. సతీమణి భారతితో కలిసి రాజ్భవన్కు వచ్చిన సీఎం.. తొలుత గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్తో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.
ఇటీవలే దిల్లీలో పర్యటించిన గవర్నర్.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పరిపాలనపై ప్రధాని, కేంద్ర హోం మంత్రికి గవర్నర్ నివేదిక ఇచ్చారు. దిల్లీ పర్యటన అనంతరం ఇరువురూ సమవేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో దిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని, హోం మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలను సీఎంకు గవర్నర్ వివరించినట్టు తెలిసింది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం గవర్నర్కు వివరించారు. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్నీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్కు సీఎం తెలిపినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే