Ambati: పవన్‌ కల్యాణ్ ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలి: మంత్రి అంబటి

జగన్‌మోహన్‌రెడ్డి  మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని మంత్రి అంబటి స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఆయన విరుచుకుపడ్డారు. 

Published : 01 Jul 2023 15:38 IST

గుంటూరు: భీమవరంలో పవన్‌ కల్యాణ్ ఓ రౌడీలా.. అసాంఘిక శక్తిలా మాట్లాడారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడమేనా పవన్‌ పాలసీ? అని ప్రశ్నించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అంబటి .. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్‌ మాటలు విని నవ్వాలో, ఏడవాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. మాట్లాడితే పవన్‌ కల్యాణ్ విప్లవం అంటున్నారని, ఇంతకీ ఆయన ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలన్నారు. 3 పెళ్లిళ్ల వీరుడు పవన్‌ కల్యాణ్ నీతులు చెబితే హాస్యాస్పదంగా ఉందని, 3 పెళ్లిళ్లు చేసుకోవడమేనా పవన్‌ చెప్పే ఆదర్శమని ఎద్దేవా చేశారు. జగన్‌ పోవాలంటున్న పవన్‌.. ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని అంబటి స్పష్టం చేశారు.  సినిమా పిచ్చి, కుల పిచ్చితో యువత పవన్‌ను అనుసరించ వద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని