Andhra News: సీఎంను ఆరాధించండి.. ఆరా తీయకండి: మంత్రి చెల్లుబోయిన
పాత్రికేయుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
అమరావతి: పాత్రికేయుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని.. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం జగన్ గురించి ఆరా తీయకుండా ఆరాధించాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఆరా తీస్తే ఆరాధనకు సరైన ఫలాలు రావన్నారు. సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.