డీపీఆర్లు ఇస్తే బండారం బయటకు..: బండి సంజయ్
కాళేశ్వరం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వకుండానే..
హైదరాబాద్: కాళేశ్వరం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వకుండానే ఇస్తున్నట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం సందర్శన నేపథ్యంలో బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్లో కేవలం 17.50 లక్షల ఎకరాలే చూపించిన రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరందిస్తున్నట్లు చెబుతూ మోసం చేస్తోందన్నారు. కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిగిన డీపీఆర్లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని.. ప్రాజెక్టుకు సంబంధించి మూడో టీఎంసీ డీపీఆర్ ఇస్తే సీఎం బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడికైనా వచ్చి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల దృష్టిని మరల్చలేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా విఫలమైందని.. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు దర్శనీయ స్థలం అవుతుందే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు.
ఇవీ చదవండి..
TS: ప్రభుత్వం ముందు 14 డిమాండ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!