జనాభా తగ్గాలంటే అదొక్కటే సరిపోదు: నీతీశ్
జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు......
పట్నా: జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన జనాభా నియంత్రణ సాధ్యం కాదనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ప్రతి రాష్ట్రానికీ స్వతంత్రత ఉంటుందన్నారు. అయితే, మహిళలు చదువుకున్నప్పుడే వారిలో తగిన చైతన్యం వస్తుందని, తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు నీతీశ్ అన్నారు. కేంద్రం కూడా అలర్ట్ మోడ్లోనే ఉందని చెప్పారు. ఆక్సిజన్తో పాటు ప్రతిదీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్రులు, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. కరోనా పరిస్థితిని నిరంతరం మానిటరింగ్ చేస్తునే ఉన్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్