Telangana News: తెరాస నేతల పదవులు భాజపా పెట్టిన భిక్ష: బండి సంజయ్
పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత తెరాసకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే
వనపర్తి: పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత తెరాసకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికమని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కిష్టంపల్లె స్టేజీ వద్ద 100కి.మీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. చమురుపై కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిందన్నారు. 18 రాష్ట్రాలు స్థానికంగా విధించే పన్నులను తగ్గించాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా తగ్గించలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యాట్ నాలుగు శాతం పెంచారని బండి సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ పోరాట ఫలితంగానే బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని.. దశాబ్దాల కాలం నాటి జాతీయ పార్టీలో నాయకుడినని చెప్పారు. తెరాస నేతలు అనుభవిస్తున్న పదవులు భాజపా పెట్టిన భిక్ష అని సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెరాసను తోక పార్టీ అన్న బండి సంజయ్ ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.